Andhra Pradesh: మత్స్యకారుడి వలలో ఒకే ఒక్క పులస చేప.. వేలంలో భారీ ధర పలికిన వైనం

  • అంతర్వేది వద్ద వలలో పడిన పులస
  • రెండు కిలోలు తూగిన చేప
  • రూ.18 వేలకు దక్కించుకున్న వ్యాపారి
Pulasa Sold For Heavy Price In Antarvedi

మార్కెట్ లో పులస చేపకు ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం గోదావరిలోనే వరద సీజన్ లోనే దొరికే ఆ చేపంటే పడి చచ్చిపోయేవారు ఎంతో మంది ఉంటారు. దాని టేస్ట్ కు ఫిదా అయిపోతుంటారు. సాధారణంగా వరదకు ఎదురొస్తుంటాయి ఈ చేపలు.

అయితే ఇవాళ తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది వశిష్ఠ గోదావరిలో ఓ మత్స్యకారుడి వలలో పులస చేప పడింది. అది కూడా ఒకే ఒక్క చేప చిక్కింది. రెండు కిలోల వరకు తూగిన ఆ చేపను వేలానికి పెట్టారు. దీంతో పలువురు వ్యాపారులతో పాటు పులస ప్రియులు దానిని కొనుగోలు చేసేందుకు పోటాపోటీగా వేలం పాడారు. చివరకు నరసాపురానికి చెందిన ఓ వ్యాపారి రూ.18 వేలకు పులసను దక్కించుకున్నాడు. అవును మరి, ఉన్నదే ఒక్క పులస.. అది దక్కాలంటే ఆ మాత్రం పెట్టాల్సిందే!

More Telugu News