Corona Virus: ఏపీలో మరో 1,393 మందికి కరోనా పాజిటివ్

  • గత 24 గంటల్లో 60,350 కరోనా పరీక్షలు
  • చిత్తూరు జిల్లాలో 272 కొత్త కేసులు
  • కర్నూలు జిల్లాలో ఐదుగురికి పాజిటివ్
  • రాష్ట్రంలో 8 మంది మృతి
  • ఇంకా 14,797 మందికి చికిత్స
Corona details of AP

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 60,350 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 1,393 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 272 కొత్త కేసులు నమోదు కాగా, తూర్పు గోదావరి జిల్లాలో 206, నెల్లూరు జిల్లాలో 201, కృష్ణా జిల్లాలో 162 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 5 కేసులు గుర్తించారు.

అదే సమయంలో 1,296 మంది కరోనా నుంచి కోలుకోగా, 8 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,36,179 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,07,330 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 14,797 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,052కి పెరిగింది.

More Telugu News