BJP: కోతుల దాడి.. భ‌వ‌నంపై నుంచి ప‌డి బీజేపీ యూపీ నేత భార్య మృతి

  • గుడికి వెళ్లి వ‌చ్చిన బీజేపీ నాయ‌కురాలు సుష్మా చౌహాన్‌
  • కోతులు గుంపులుగా క‌న‌ప‌డ్డ వైనం
  • వాటిని త‌రుముతూ కాలు జారి ప‌డ్డ సుష్మ
bjp up leader wife dies

కోతులు దాడి చేయ‌డంతో భ‌వ‌నంపై నుంచి ప‌డి యూపీ బీజేపీ నేత అనిల్ చౌహాన్‌ భార్య, స్థానిక పంచాయతీ మాజీ సభ్యురాలు సుష్మా చౌహాన్ మృతి చెందారు. ఆ రాష్ట్రంలోని షామ్లీ ప్రాంతంలోని కైరానాలో కొంత కాలంగా కోతుల బెడ‌ద పెరిగిపోయింది. అధికారులూ ప‌ట్టించుకోక‌పోవ‌డంతో కోతుల స‌మ‌స్య‌కు అడ్డుక‌ట్ట ప‌డ‌డం లేదు.

సుష్మా చౌహాన్ ఉదయం ఆలయానికి వెళ్లి ఇంటికి వ‌చ్చేస‌రికి రెండో అంత‌స్తుపై కోతుల గుంపు క‌న‌ప‌డింది. వాటిని సుష్మ తరిమికొట్టే ప్రయత్నం చేస్తుండగా ఆమెపై దాడి చేయ‌డంతో ఆమె పట్టుతప్పి రెండవ కాలుజారి కింద పడ్డారు. ఈ విష‌యాన్ని గుర్తించిన స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు.

అయితే, అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయార‌ని ఆసుప‌త్రి వైద్యులు నిర్ధారించారు. కైరానాలో కోతులు దాడులు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. సుష్మ మృతికి అధికారుల నిర్లక్ష్యమే కార‌ణ‌మ‌ని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

More Telugu News