Jagga Reddy: కాంగ్రెస్ బలాన్ని తట్టుకోలేక కేసీఆర్ ఢిల్లీకి పోయి ఎన్నికలు వాయిదా వేసుకున్నారు: జగ్గారెడ్డి

  • ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జగ్గారెడ్డి
  • కేసీఆర్ బీజేపీకి దగ్గరవుతున్నారని కామెంట్ 
  • అధికారం కాపాడుకునేందుకేనని ఆరోపణ
  • బండి సంజయ్ ఓ బకరా అంటూ వ్యాఖ్యలు
Jaggareddy comments on CM KCR and BJP leaders

కాంగ్రెస్ శాసనసభ్యుడు జగ్గారెడ్డి సీఎం కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ బలాన్ని తట్టుకోలేక కేసీఆర్ ఢిల్లీకి పోయి ఎన్నికలు వాయిదా వేసుకున్నారని అన్నారు. కేసీఆర్ అధికార పీఠం నిలుపుకునేందుకు బీజేపీకి దగ్గరవుతున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. ఢిల్లీలో ఆయన బీజేపీ నేతలతో తిరుగుతున్నారని విమర్శించారు. బలపడుతున్న కాంగ్రెస్ ను అడ్డుకునేందుకు బీజేపీ, టీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు.

బండి సంజయ్ ఓ డమ్మీ నేత అని, ఢిల్లీ బీజేపీ పెద్దలు బండిని బకరా చేశారని ఎద్దేవా చేశారు. కేసీఆర్, అమిత్ షాల ఆటలో బండి బలైపోతారని వ్యాఖ్యానించారు. బండి సంజయ్ మొదటి బకరా అయితే, ఈటల రాజేందర్ రెండో బకరా అని ఎద్దేవా చేశారు. తెలంగాణ బీజేపీ చేతుల్లో ఏమీలేదని, అంతా ఢిల్లీ చేతుల్లోనే ఉందని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

More Telugu News