Cochin Shipyard: కొచ్చి నేవీ స్థావరాలను బాంబులతో పేల్చేస్తామంటూ బెదిరింపులు

  • కొచ్చి షిప్ యార్డులో పలు నేవీ స్థావరాలు
  • ఇక్కడే ఉన్న ఐఎన్ఎస్ విక్రాంత్ 
  • గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఈ-మెయిల్
  • తాజా బెదిరింపుతో నేవీ వర్గాల్లో ఆందోళన
Bomb threat for Cochin Shipyard

కేరళలోని కొచ్చి షిప్ యార్డుకు నేడు బాంబు బెదిరింపులు వచ్చాయి. కీలకమైన భారత నేవీ స్థావరాలను తుత్తునియలు చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఈ-మెయిల్ వచ్చింది. దాంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. కొచ్చి పోలీసులకు ఈ-మెయిల్ బెదిరింపుపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

దేశీయంగా తయారుచేసిన మొట్టమొదటి విమానవాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ కొచ్చి షిప్ యార్డ్ లోనే ఉంది. ఈ నేపథ్యంలో బాంబు బెదిరింపులు నేవీ వర్గాలను ఆందోళనకు గురిచేశాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ ను కొచ్చి షిప్ యార్డ్ లోనే నిర్మించారు.

More Telugu News