కొచ్చి నేవీ స్థావరాలను బాంబులతో పేల్చేస్తామంటూ బెదిరింపులు

Bomb threat for Cochin Shipyard
  • కొచ్చి షిప్ యార్డులో పలు నేవీ స్థావరాలు
  • ఇక్కడే ఉన్న ఐఎన్ఎస్ విక్రాంత్ 
  • గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఈ-మెయిల్
  • తాజా బెదిరింపుతో నేవీ వర్గాల్లో ఆందోళన
కేరళలోని కొచ్చి షిప్ యార్డుకు నేడు బాంబు బెదిరింపులు వచ్చాయి. కీలకమైన భారత నేవీ స్థావరాలను తుత్తునియలు చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఈ-మెయిల్ వచ్చింది. దాంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. కొచ్చి పోలీసులకు ఈ-మెయిల్ బెదిరింపుపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

దేశీయంగా తయారుచేసిన మొట్టమొదటి విమానవాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ కొచ్చి షిప్ యార్డ్ లోనే ఉంది. ఈ నేపథ్యంలో బాంబు బెదిరింపులు నేవీ వర్గాలను ఆందోళనకు గురిచేశాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ ను కొచ్చి షిప్ యార్డ్ లోనే నిర్మించారు.
Go Back to Shorts
Cochin Shipyard
Bomb Threat
Email
Navy
INS Vikrant
India

More Telugu News