Sharmila: ఉప ఎన్నికల‌లో వేల కోట్లు ఖర్చు చేస్తున్నాడు: కేసీఆర్‌పై ష‌ర్మిల ఆరోప‌ణ‌లు

  • కేసీఆర్ గారికి ఓట్ల మీద ఉన్న ప్రేమ ప్రజల ప్రాణాల మీద లేదు
  • కరోనాతో వేల మంది చనిపోయినా కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చలేదు
  • ఎవడు ఎక్కడ సచ్చినా తాను మాత్రం ఎన్నికల్లో చావకూడద‌నుకుంటున్నాడు
  • ప్రజల ప్రాణాల కోసం వంద కోట్ల రూపాయ‌లు కూడా ఖర్చుపెడుతలేడు
sharmila slams kcr

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. ఆరోగ్య శ్రీ బిల్లులు చెల్లించక‌పోవ‌డంతో పేద‌లు వైద్యం కోసం ఇబ్బందులు ప‌డుతున్నార‌ని ఆమె చెప్పారు.

'కేసీఆర్ గారికి ఓట్ల మీద ఉన్న ప్రేమ ప్రజల ప్రాణాల మీద లేదు. కరోనాతో వేల మంది చనిపోయినా కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చలేదు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకుండా పేదలకు ఉచిత వైద్యాన్ని అడ్డుకొంటున్నాడు. ఎవడు ఎక్కడ సచ్చినా నేను మాత్రం ఎన్నికల్లో చావకూడదని ఉప ఎన్నికల‌లో వేల కోట్ల రూపాయ‌లు ఖర్చు చేస్తున్నాడు' అని ష‌ర్మిల ఆరోప‌ణ‌లు గుప్పించారు.

'అంతే తప్ప ప్రజల ప్రాణాల కోసం వంద కోట్ల రూపాయ‌లు కూడా ఖర్చుపెడుతలేడు. ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను, భూములను గుంజుకొని రైతులను, వైద్యం అందకుండా పేదోళ్లను చంపుతున్నారు కేసీఆర్ సారు. బంగారు తెలంగాణ అంటే  మీ కుటుంబం ఒక్కటే సల్లగా బతుకుడా దొరా?' అని ష‌ర్మిల నిల‌దీశారు.

More Telugu News