సీఎం అశోక్ గెహ్లాట్ కు... పోస్ట్ కోవిడ్ సమస్యలు.. ఆసుపత్రిలో చేరిక
- నిన్న ఛాతీ నొప్పికి గురైన గెహ్లాట్
- ఈ ఉదయం ఆసుపత్రిలో చేరిక
- యాంజియోప్లాస్టీ నిర్వహిస్తామన్న డాక్టర్లు
మరోవైపు ఆసుపత్రి నుంచి అశోక్ గెహ్లాట్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ వల్ల నిన్నటి నుంచి ఛాతీలో విపరీతమైన నొప్పిగా ఉందని ఆయన తెలిపారు. యాంజియోప్లాస్టీ నిర్వహించబోతున్నారని చెప్పారు. ఎస్ఎంఎస్ ఆసుపత్రిలో దీన్ని నిర్వహించనున్నారని తెలిపారు. తాను బాగానే ఉన్నానని... త్వరలోనే ఆరోగ్యంతో బయటకు వస్తానని చెప్పారు. మీ అందరి ఆశీర్వాదాలు తనతో ఉంటాయని అన్నారు.