England: ఇంగ్లండ్‌లోని ప్లైమౌత్​ నగరంలో కాల్పులు.. ఆరుగురి మృతి

  • తుపాకులతో విచక్షణ రహితంగా కాల్పులు
  • మృతుల్లో అనుమానితుడు, ఇద్దరు మహిళలు
  • నిందితులకు ఉగ్రవాదులతో సంబంధాలు లేవన్న పోలీసులు
6 killed in shocking mass shooting at Plymouth  England

ఇంగ్లండ్‌లోని ప్లైమౌత్ నగరంలో ఈ ఉదయం కాల్పుల కలకలం రేగింది. స్థానిక కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 6.10 గంటలకు కొందరు దుండగులు తుపాకులతో విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కీహామ్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. అయితే, కాల్పులకు తెగబడిన దుండగులకు ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధాలు లేవని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాల్పులు జరిపిన దుండగుల్లోని ఓ వ్యక్తి కూడా మృతుల్లో ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. చనిపోయిన వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.

More Telugu News