Nagashourya: 'లక్ష్య' నుంచి కొత్త పోస్టర్ రిలీజ్!

  • నాగశౌర్య నుంచి 'లక్ష్య'
  • కథానాయికగా కేతిక శర్మ
  • కీలక పాత్రలో జగపతిబాబు 
  • త్వరలోనే విడుదల తేదీ ప్రకటన   
Lakshya new poster released

నాగశౌర్య కథానాయకుడిగా .. ఆయన 20వ సినిమాగా 'లక్ష్య' నిర్మితమైంది. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఇటీవలే చిత్రీకరణను పూర్తిచేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో నాగశౌర్య జోడీగా కేతిక శర్మ నటించింది. 'రొమాంటిక్' తరువాత ఆమె చేసిన సినిమా ఇదే.

ఈ సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్స్ రావడం లేదంటూ సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం కావడంతో, ఇకపై ప్రతి శుక్రవారం ఒక అప్డేట్ ఉంటుందంటూ ఇటీవల నాగశౌర్య చెప్పాడు. అన్నట్టుగానే ఆయన ఈ రోజున ఈ సినిమాకి సంబంధించిన సరికొత్త పోస్టర్ ను వదిలాడు. హీరో హీరోయిన్లు ప్రేమమైకంలో మునిగితేలుతున్న పోస్టర్ ఇది.

విలువిద్య నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. నాగశౌర్య సిక్స్ ప్యాక్ తో .. కొత్త లుక్ తో కనిపించనున్న ఈ సినిమాలో,  జగపతిబాబు ఓ కీలకమైన పాత్రను పోషించారు. ఆయన పాత్ర ఈ సినిమాకి అదనపు బలంగా ఉంటుందని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More Telugu News