జగన్ అక్రమాస్తుల కేసులో బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ వాయిదా
- ఇప్పటికే జగన్, రఘురామ లిఖిత పూర్వకంగా వాదనలు
- లిఖిత పూర్వకంగా తామూ వాదనలు సమర్పిస్తామన్న సీబీఐ
- మరోసారి గడువు ఇవ్వాలని విజ్ఞప్తి
- విచారణ ఈ నెల 30కి వాయిదా
అందుకు మరోసారి గడువు ఇవ్వాలని కోర్టును కోరింది. దీంతో విచారణను ఈ నెల 30కి వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. కాగా, జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై ఈ నెల 14న కూడా విచారణ జరగగా, తాము లిఖిత పూర్వకంగా వాదనలు సమర్పించేందుకు 10 రోజుల గడువు ఇవ్వాలని సీబీఐ కోరిన విషయం తెలిసిందే.
సీబీఐ తీరుపై రఘురామ తరఫు న్యాయవాది ఆ సమయంలో అభ్యంతరాలు తెలిపారు. సీబీఐ తరచూ వైఖరి మారుస్తూ కాలయాపన చేస్తోందన్నారు. దీంతో కోర్టు ఆ సమయంలో ఈ నెల 26 (నేడు)కి విచారణను వాయిదా వేయడంతో నేడు విచారణ జరిగింది. అయితే, సీబీఐ మరింత సమయం కోరడంతో వాయిదా పడింది.