Kumaraswamy: ఫోన్ ట్యాపింగుల గురించి పట్టించుకోవాల్సిన పని లేదు: కుమారస్వామి

  • దేశాన్ని కుదిపేస్తున్న పెగాసస్ స్పైవేర్
  • ఫోన్ ట్యాపింగులు 10 నుంచి 15 ఏళ్లుగా జరుగుతున్నాయి
  • గతంలో ప్రభుత్వాలు, ఐటీ శాఖ ప్రజల ఫోన్లను ట్యాప్ చేసేవి
No need to care about phone tapping says Kumaraswamy

పెగాసస్ స్పైవేర్ ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తోంది. ఈ స్పైవేర్ ను ఉపయోగించి పలువురి ఫోన్లను ట్యాప్ చేశారని, ఫోన్లపై నిఘా ఉంచారనే వార్తలు కలకలం రేపుతున్నాయి. పార్లమెంటును సైతం ఈ అంశం కుదిపేస్తోంది. మరోవైపు కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ల సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి ఈ స్పైవేరే కారణమంటూ మీడియాలో వస్తున్న కథనాలు సంచలనం రేకెత్తిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగులు గత 10 నుంచి 15 ఏళ్లుగా జరుగుతున్నాయని ఆయన అన్నారు. ప్రజల ఫోన్లను గతంలో ప్రభుత్వాలు, ఆదాయపు పన్ను శాఖ ట్యాప్ చేసేవని చెప్పారు. మన దేశంలో ఏ ప్రభుత్వాలైనా, ఏ పార్టీలయినా, సమాచారం కోసమో లేదా వారి ప్రయోజనాలను కాపాడుకోవడం కోసమో ఇలా చేస్తుంటాయని అన్నారు. ఇలాంటి అంశాలను సీరియస్ గా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు.

More Telugu News