Dog: శునకంపై క్రూరత్వం... ఇద్దరు మహిళల అరెస్ట్!

  • పంజాబ్ లోని పాటియాలాలో ఘటన
  • శునకాన్ని లాక్కెళ్లిన ఇద్దరు
  • తీవ్రంగా స్పందించిన జంతు ప్రేమికులు
Two Women Arrested for Asaulting Dog

పంజాబ్ లోని పాటియాలాలో దారుణం జరిగింది. ఇద్దరు మహిళలు తమ ద్విచక్ర వాహనంపై వెళుతూ, ఓ శునకాన్ని ఏ మాత్రం కనికరం లేకుండా లాక్కుని తీసుకువెళుతున్న వీడియో వైరల్ కాగా, వారి చర్యపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఆపై వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

వీరిద్దరినీ పాటియాలా సమీపంలోని ఓ గ్రామానికి చెందిన చంచల్, సోనియాగా గుర్తించామని, వారు ఓ కుక్కను వాహనానికి కట్టేసి లాక్కెళ్లినట్టు సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలు కనిపించాయని పోలీసులు వెల్లడించారు.

జంతువులపై క్రూరత్వాన్ని చూపినందుకు వారిని అదుపులోకి తీసుకున్నామని, ఆపై బెయిల్ మీద వారు విడుదల అయ్యారని పోలీసులు తెలిపారు. కాగా, ఆ శునకం తీవ్రగాయాలపాలై మరణించడం జంతు ప్రేమికులను కలవరపరిచింది.

More Telugu News