Arvind Kejriwal: సింగపూర్ లో కొత్త కరోనా వేరియంట్.. అక్కడి నుంచి వచ్చే అన్ని విమానాలను ఆపేయండి: కేజ్రీవాల్

  • సింగపూర్ కరోనా వేరియంట్ మన దేశానికి ప్రమాదకరం
  • థర్డ్ వేవ్ కు దారితీసే అవకాశం ఉంది
  • చిన్న పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుంది
Stop all flights from Singapore demands Kejriwal

సింగపూర్ లో కరోనా వైరస్ కొత్త వేరియంట్ మన దేశానికి ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. ఆ వేరియంట్ మన దేశంలో థర్డ్ వేవ్ కు దారితీసే అవకాశం ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో సింగపూర్ నుంచి వచ్చే విమానాలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

సింగపూర్ నుంచి వచ్చే కరోనా వేరియంట్ చిన్న పిల్లలకు చాలా హాని కలిగిస్తుందని కేజ్రీ అన్నారు. ఈ నేపథ్యంలో తక్షణమే సింగపూర్ నుంచి విమానాలను రద్దు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. చిన్న పిల్లలకు కూడా వెంటనే వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కోరారు. 

More Telugu News