Ayyanna Patrudu: జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేసిన వ్యక్తిని అరెస్ట్ చేయడం బెయిల్ నిబంధనల ఉల్లంఘన కాదా?: అయ్యన్న

  • హైదరాబాదులో ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్
  • విజయవాడ తరలిస్తున్న ఏపీ సీఐడీ అధికారులు
  • అరెస్టులన్నీ శుక్రవారమే జరుగుతాయన్న అయ్యన్న
  • కోర్టులకు శని, ఆదివారాలు సెలవులని వెల్లడి
  • బెయిల్ రాకుండా చేసేందుకేనని వ్యాఖ్యలు
Ayyanna Patrudu questions Raghurama Krishna Raju arrest

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ పోలీసులు ఈ సాయంత్రం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రఘురామను సీఐడీ అధికారులు హైదరాబాద్ నుంచి విజయవాడ తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు తనదైన శైలిలో స్పందించారు. ప్రాణాలు పోతున్న రోగులను తెలంగాణ సరిహద్దుల వద్ద ఆపుతున్నారు కానీ, ఏపీ సీఐడీ పోలీసులను మాత్రం ఆపడంలేదు... ఆ రహస్యం ఏమిటో? అని సందేహం వ్యక్తం చేశారు.

"వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకమైన వారి అరెస్టులన్నీ శుక్రవారమే జరుగుతాయి. కూల్చివేతల ముహూర్తం శనివారం తెల్లవారుజామునే ఉంటుంది. కోర్టులకు శని, ఆదివారాలు సెలవు కాబట్టి బెయిళ్లు, స్టేలు రాకుండా ఉండేందుకు ఆ రోజులను ఎంచుకుంటున్నారు. జగన్ బెయిల్ రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ వేసిన వ్యక్తిని అరెస్ట్ చేయించడం బెయిల్ నిబంధనల ఉల్లంఘన కిందకు రాదా?" అని అయ్యన్న వ్యాఖ్యానించారు.

More Telugu News