Mumbai Indians: ఐపీఎల్: చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబయి

  • ఐపీఎల్ లో నేడు ముంబయి వర్సెస్ చెన్నై
  • ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి
  • ముంబయి జట్టులో రెండు మార్పులు
  • నీషామ్, కులకర్ణిలకు చోటు
Mumbai Indians won the toss and opts bowling against Chennai Super Kings

ఐపీఎల్ లో నేడు రెండు బలమైన జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ పోరులో టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. చెన్నైని తక్కువ స్కోరుకే పరిమితం చేసి, సులువుగా లక్ష్యాన్ని ఛేదించాలని భావిస్తోంది.

ఈ మ్యాచ్ కోసం స్పిన్నర్ జయంత్ యాదవ్ స్థానంలో ఆల్ రౌండర్ జేమ్స్ నీషామ్, నాథన్ కౌల్టర్ నైల్ స్థానంలో ధవళ్ కులకర్ణి ముంబయి జట్టులోకి వచ్చారు. అటు, చెన్నై జట్టులో ఎలాంటి మార్పుల్లేవని ఆ జట్టు కెప్టెన్ ధోనీ తెలిపాడు.

More Telugu News