భారత్-చైనా సైనిక కమాండర్ల మధ్య నేడు కీలక చర్చలు
- ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న చర్చలు
- నేడు 11వ విడత కోర్ కమాండర్ల భేటీ
- చర్చలు సఫలమైతే ఇరు దేశాల్లో పూర్తి ప్రశాంత వాతావరణం నెలకొనే అవకాశం
ఇప్పటి వరకు జరిగిన చర్చల్లో కొంతవరకు పురోగతి కనిపించడంతో పాంగాంగ్ సరస్సు, దక్షిణ రేవుల వద్ద రెండు దేశాలు బలగాలను ఉపసంహరించుకున్నాయి. అయితే, ఘర్షణలకు కేంద్ర బిందువైన మిగతా ప్రాంతాల్లో మాత్రం సైనిక మోహరింపు కొనసాగుతోంది.
తాజా చర్చలు సఫలమైతే గోగ్రాలోయ, హాట్స్ప్రింగ్స్, దెమ్ చోక్లలో ఉద్రిక్తతలు సడలి ప్రశాంత వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. ఇరు దేశాల మధ్య ఇది 11వ విడత కోర్ కమాండర్ల భేటీ అని, నిర్దేశిత ఒప్పందాలకు అనుగుణంగా ఉద్రిక్తతలు తగ్గించుకునేందుకు భారత్ తమతో కలిసి పనిచేస్తుందని ఆశిస్తున్నట్టు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ పేర్కొన్నారు.