ప్రత్యేకంగా కరోనా చికిత్స కోసం మాత్రలు... త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం!
- కేవలం కరోనా చికిత్స కోసమే ప్రత్యేకంగా ఔషధం
- ఇప్పటివరకు ఇతర వ్యాధుల ఔషధాల వాడకం
- సంయుక్తంగా అభివృద్ధి చేసిన మెర్క్-రిడ్జ్ బ్యాక్
- మోల్నుపిరావిర్ పేరిట మాత్రలు
- ప్రయోగాల్లో ఆశాజనకంగా ఫలితాలు
గతంలో ఫ్లూ జ్వరాలు బాగా ప్రబలినప్పుడు టామీ ఫ్లూ పేరుతో దానికోసమే ప్రత్యేక ఔషధం తీసుకువచ్చారు. అది అమోఘమైన ఫలితాలను ఇచ్చింది. ఇప్పుడు కరోనాపై మోల్నుపిరావిర్ కూడా అదే రీతిలో ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. మనిషి దేహంలో ప్రవేశించిన కరోనా వైరస్ తిరిగి ఉత్పత్తి కాకుండా మోల్నుపిరావిర్ అడ్డుకుంటుంది. తద్వారా శరీరంలో వైరస్ వ్యాప్తిని తగ్గిస్తుంది. ఇది త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.