Spike: ఏపీలో కరోనా విజృంభణ... 1,730 కొత్త కేసులు నమోదు

  • గత 24 గంటల్లో 31,072 కరోనా పరీక్షలు
  • గుంటూరు జిల్లాలో 378 మందికి పాజిటివ్
  • చిత్తూరు జిల్లాలో 338 కేసులు నమోదు
  • కరోనా నుంచి కోలుకున్న 842 మంది
  • మరో ఐదుగురి మృతి
Spike in AP Corona cases

ఏపీలో కరోనా మహమ్మారి మళ్లీ తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతోంది. గడచిన 24 గంటల్లో 31,072 కరోనా పరీక్షలు నిర్వహంచగా 1,730 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 378 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 338, విశాఖ జిల్లాలో 235, కృష్ణా జిల్లాలో 226, నెల్లూరు జిల్లాలో 164 కేసులు గుర్తించారు. అత్యల్పంగా పశ్చిమ గోదావరిలో 10 కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో 842 మంది కరోనా నుంచి కోలుకోగా, ఐదుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 9,07,676 మందికి కరోనా సోకగా, వారిలో 8,90,137 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 10,300 మందికి చికిత్స జరుగుతోంది. కరోనా మరణాల సంఖ్య 7,239కి చేరింది.

More Telugu News