రేపు రాజకీయ పార్టీలతో సమావేశం కానున్న ఏపీ ఎస్ఈసీ నీలం సాహ్నీ
- కలెక్టర్లు, ఎస్పీలతో ముగిసిన సమావేశం
- పరిషత్ ఎన్నికల నిర్వహణపై చర్చ
- కోర్టులో తీర్పు పెండింగ్ లో ఉన్న అంశం ప్రస్తావన
- కోర్టు తీర్పు వచ్చాకే ఎన్నికలపై ప్రకటన!
కాగా, పరిషత్ ఎన్నికలపై కోర్టులో ఓ కేసు పెండింగ్ లో ఉన్న అంశాన్ని కూడా ఆమె ఉన్నతాధికారులతో చర్చించారు. కోర్టు తీర్పు వచ్చాకే ఎన్నికల ప్రక్రియ కొనసాగిద్దామని ఆమె పేర్కొన్నట్టు తెలిసింది. పరిషత్ ఎన్నికలపై దాఖలైన పిటిషన్లను ఇప్పటికే విచారించిన హైకోర్టు తీర్పును రిజర్వ్ లో ఉంచింది. ఈ తీర్పు ఏప్రిల్ 3న వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, కోర్టు తీర్పు వచ్చాకే పరిషత్ ఎన్నికల ప్రకటన ఉంటుందని తెలుస్తోంది.