మొబైల్ ఫిష్ ఔట్ లెట్ల ద్వారా నాణ్యమైన చేపల అమ్మకం: తలసాని శ్రీనివాస్ యాదవ్
- కులవృత్తులకు కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు
- మత్స్యకారులకు ఉపాధి కల్పించేందుకు మొబైల్ వాహనాలు ఇస్తున్నాం
- జనం ఉన్న చోట వాహనాన్ని ఆపి చేపలు అమ్ముకోవచ్చు
రాష్ట్రంలో ఏ ఒక్క మత్స్యకారుడు ఖాళీగా ఉండకుండా వారికి ఉపాధి కల్పిస్తున్నామని తలసాని అన్నారు. ఉమ్మడి ఏపీలో మత్స్యశాఖకు రూ. 10 కోట్ల బడ్జెట్ మాత్రమే ఉండేదని... ప్రస్తుతం ఆ బడ్జెట్ ను రూ. 100 కోట్లకు పెంచామని చెప్పారు. ఫిష్ మొబైల్ ఔట్ లెట్లలో నాణ్యమైన చేపలను అందిస్తామని... జనం ఉన్నచోట మొబైల్ వెహికల్స్ ను ఆపి, చేపలను అమ్ముకోవచ్చని తెలిపారు. రూ. 10 లక్షల విలువ చేసే ఈ మొబైల్ వాహనాలను మహిళలకు అందిస్తామని చెప్పారు. రానున్న రోజుల్లో 500 మొబైల్ ఫిష్ ఔట్ లెట్లను అందిస్తామని తెలిపారు. ఇప్పటి వరకు 25 వేల మత్స్యకారులకు ఉచితంగా ద్విచక్రవాహనాలను ఇచ్చామని చెప్పారు.