Tamilnadu: రోడ్డుపక్కనే బట్టలు ఉతికిన అన్నాడీఎంకే ఎమ్మెల్యే అభ్యర్థి!

  • తమిళనాడులో నాయకుల వినూత్న ప్రచారం
  • ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యం
  • బట్టలు ఉతికి ఆకర్షించేందుకు అన్నాడీఎంకే అభ్యర్థి పాట్లు
  • గెలిస్తే వాషింగ్‌ మెషీన్‌ కొనిస్తామని హామీ
Campaigning in a diff way in TN

తమిళనాడులో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నాయకులు వినూత్న రీతిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. తాజాగా అన్నాడీఎంకే అభ్యర్థి తంగ కతిరవన్‌ ఓటర్ల దృష్టి ఆకర్షించేందుకు వినూత్న ప్రయత్నం చేశారు. క్షేత్రస్థాయికి వెళ్లిన ఆయన ఓ చోట నేలపై కూర్చొని బట్టలు ఉతికారు. తాను గెలిస్తే వాషింగ్‌ మెషీన్లు కొనిస్తామని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. కతిరవన్‌ నాగపట్టినం నుంచి పోటీ చేస్తున్నారు.  

234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్‌ 6న ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు మే 2న వెలువడతాయి. ఈ నేపథ్యంలో రెండు ప్రధాన పార్టీలైన అన్నాడీఎంకే, డీఎంకే భారీ ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నాయి. సినీ నటుడు కమలహాసన్‌ పార్టీ మక్కల్ నీది మయ్యంతో కూడిన కూటమి సైతం ప్రభావం చూపే సూచనలు కనిపిస్తున్నాయి.

More Telugu News