Team India: ఇంగ్లండ్ తో రెండో టీ20లో టాస్ గెలిచిన టీమిండియా

Team India won the toss in second match against England
  • భారత్, ఇంగ్లండ్ మధ్య నేడు రెండో టీ20
  • అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
  • ఈ మ్యాచ్ లోనూ రోహిత్ లేకుండానే బరిలోకి
  • ఇప్పటికే తొలి మ్యాచ్ నెగ్గిన ఇంగ్లండ్
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా నేడు రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ పోరులో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే తొలి టీ20లో ఓటమిపాలైన భారత జట్టు ఈ మ్యాచ్ లో గెలిచి సమం చేయాలని భావిస్తోంది. తొలి మ్యాచ్ కు రోహిత్ శర్మను విశ్రాంతి పేరుతో పక్కనబెట్టిన టీమిండియా మేనేజ్ మెంట్ పై విమర్శలు రావడం తెలిసిందే.

అయితే ఈ మ్యాచ్ లోనూ రోహిత్ ను తీసుకోలేదు. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ కు స్థానం కల్పించారు. అటు, ఇంగ్లండ్ జట్టులో ఆల్ రౌండర్ టామ్ కరన్ కు తుదిజట్టులో చోటిచ్చారు.
Team India
Toss
2nd T20
England
Ahmedabad

More Telugu News