Raja Singh: 'కేటీఆర్ నాస్తికుడు'.. చుర‌క‌లంటించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

  • గ్యాస్ సిలిండ‌ర్‌కి మొక్కి వ‌చ్చి ఓటేశాన‌న్న కేటీఆర్‌
  • భైంసా హిందువుల కాళ్లు మొక్కాల‌ని  రాజాసింగ్ వ్యాఖ్య‌
  • గ్యాస్ సిలిండ‌ర్‌కు మొక్క‌డం సిగ్గుచేట‌ని విమర్శ‌
raja singh slams ktr

తెలంగాణ‌లో రెండు ఎమ్మెల్సీ స్థానాల‌కు పోలింగ్ కొనసాగుతోన్న నేప‌థ్యంలో హైద‌రాబాద్‌, షేక్‌పేటలోని తహసీల్దార్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఓటుహక్కును వినియోగించుకున్న విష‌యం తెలిసిందే. ఇంట్లో బ‌య‌లుదేరే ముందు గ్యాస్ సిలిండ‌ర్‌కు న‌మ‌స్కారం పెట్టి వ‌చ్చి ఓటేశానని కేటీఆర్ ఈ సంద‌ర్భంగా చేసిన వ్యాఖ్య‌ల‌ను బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్  తిప్పికొట్టారు.

కేటీఆర్ మొక్కాల్సింది గ్యాస్ సిలిండర్‌కు కాదని, భైంసాలో హిందువుల కాళ్లు మొక్కాల‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. అటువంటి మంత్రి దొర‌క‌డం ప్ర‌జ‌ల దుర‌దృష్ట‌మ‌ని చెప్పారు. రాష్ట్రంలో హిందువులపై జరుగుతున్న దాడులు కేటీఆర్‌కు ఏమాత్రం కనిపించడం లేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కేటీఆర్‌ నాస్తికుడ‌ని రాజాసింగ్ గుర్తు చేస్తూ.. ఆయ‌న‌ సిలిండర్‌కు మొక్కి ఓటు వేశాననడం సిగ్గుచేటని విమ‌ర్శించారు. పట్టభద్రుల సమస్యలపై పోరాడే అభ్య‌ర్థుల‌కే ఓటు వేయాలని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.


More Telugu News