లోక్ సభలో కాంగ్రెస్ నేతగా రవ్ నీత్ సింగ్ బిట్టూ నియామకం
- బెంగాల్ ఎన్నికల్లో బిజీగా ఉన్న అధిర్ రంజన్ చౌధరి
- ప్రస్తుతం లోక్ సభలో కాంగ్రెస్ విప్ గా ఉన్న బిట్టూ
- మాజీ సీఎం బియాంత్ సింగ్ మనవడే బిట్టూ
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ మనవడే రవ్ నీత్ సింగ్ బిట్టూ కావడం గమనార్హం. 45 ఏళ్ల బిట్టూ మూడోసారి ఎంపీగా గెలుపొందారు. 2009లో తొలిసారి ఆనంద్ పూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి గెలిచారు. ఆ తర్వాత 2014, 2019లో లుథియానా నుంచి గెలుపొందారు. గత ఆగస్టులో లోక్ సభలో కాంగ్రెస్ విప్ గా బిట్టూ నియమితులయ్యారు. ఎన్నికల తర్వాత మళ్లీ అధిర్ రంజన్ చౌధరి నాయకత్వ బాధ్యతలను స్వీకరిస్తారు.