Sharmila: బెంగళూరు నుంచి హైదరాబాద్ చేరుకున్న వైఎస్ షర్మిల... రేపు మరో కీలక భేటీ!

  • తెలంగాణలో కొత్త పార్టీకి షర్మిల సన్నాహాలు
  • ఇటీవల లోటస్ పాండ్ లో సమావేశం
  • ఈసారి హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల నేతలతో సమావేశం
  • ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ తో ఖమ్మం జిల్లా పర్యటన వాయిదా
YS Sharmila arrives Hyderabad from Bengaluru

తెలంగాణలో పార్టీ ప్రారంభించేందుకు ఉత్సాహంగా ఉన్న వైఎస్ షర్మిల ఆ దిశగా తన కార్యాచరణ వేగవంతం చేశారు. ఇటీవలే హైదరాబాదు లోటస్ పాండ్ లో వైఎస్సార్ అభిమానులు, సన్నిహితులతో సమావేశమై తన మనోభావాలను వారితో పంచుకున్న షర్మిల మరో సమావేశానికి సిద్ధమయ్యారు. ఆమె ఈ సాయంత్రం బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చారు. రేపు హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీకి కూడా లోటస్ పాండ్ నివాసం వేదిక కానుంది. అటు, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా షర్మిల ఖమ్మం పర్యటన వాయిదా పడింది.

More Telugu News