TRS: తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభం

  • సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం
  • పార్టీ సంస్థాగత వ్యవహారాలపై చర్చ
  • హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
  • ఇతర ప్రజాప్రతినిధులు కూడా హాజరు
TRS party state executive body meeting

సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం కొద్దిసేపటి కిందట ప్రారంభమైంది. హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. మొదట నోముల నర్సింహయ్య చిత్రపటానికి సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు.

కాగా, టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత వ్యవహారాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికతో పాటు పార్టీ సభ్యత్వాల పునరుద్ధరణ, గ్రామీణ ప్రాంతాల వరకు పార్టీ కమిటీల ఏర్పాటు ఈ సమావేశం అజెండాలో ప్రముఖంగా ఉన్నాయి. ఏప్రిల్ 27న జరిగే టీఆర్ఎస్ పార్టీ వార్షిక మహాసభ గురించి కూడా సీఎం కేసీఆర్ ఈ సమావేశంలో చర్చించనున్నారు.

More Telugu News