TRS: ఈ నెల 7న సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం

  • పార్టీ వ్యవహారాలపై దృష్టి సారించిన సీఎం కేసీఆర్
  • ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం
  • రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు ప్రజాప్రతినిధుల హాజరు
  • సంస్థాగత నిర్ణయాలపై చర్చించనున్న అధినాయకత్వం
TRS Party state level meeting on Sunday at Telngana Bhavan

టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత వ్యవహారాలపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. ఈ నెల 7వ తేదీన సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్ పర్సన్లు, జడ్పీ చైర్ పర్సన్లు, మున్సిపల్ మేయర్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు హాజరుకానున్నారు.

ఈ సమావేశంలో పార్టీ పరమైన అంశాలపై చర్చించనున్నారు. పార్టీ సభ్యత్వాల పునరుద్ధరణ, గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ కమిటీల నియామకం,  పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక, పార్టీ వార్షిక మహాసభ (ఏప్రిల్ 27), ఇతర సంస్థాగత అంశాలపై ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకుంటారు.

More Telugu News