ఒంగోలు రిమ్స్ డెంటల్ డాక్టర్ ను సీఎం ఆదేశాలతో మెరుగైన చికిత్స కోసం చెన్నై తరలించాం: మంత్రి ఆళ్ల నాని
- ఒంగోలు రిమ్స్ లో పనిచేస్తున్న డాక్టర్ ధనలక్ష్మి
- తాత్కాలిక పద్ధతిలో సేవలు
- ఇటీవల తీవ్ర అనారోగ్యం
- స్పెషల్ కేసుగా పరిగణించిన సీఎం జగన్
- ప్రస్తుతం చెన్నై అపోలో ఆసుపత్రిలో కోలుకుంటున్న ధనలక్ష్మి
ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో డాక్టర్ ధనలక్ష్మికి మెరుగైన వైద్యం అందుతోందని, ఆమె కోలుకుంటున్నారని వెల్లడించారు. త్వరలోనే ఆమె పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తారని భావిస్తున్నామని తెలిపారు. చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డాక్టర్ ధనలక్ష్మి ఆరోగ్య పర్యవేక్షణ కోసం ఒంగోలు నుంచి ప్రత్యేకంగా మత్తువైద్యుడు డాక్టర్ ప్రదీప్ ను కూడా పంపించామని మంత్రి ఆళ్ల నాని వివరించారు.