Pawan Kalyan: ఈ నెల 21వ తేదీన తిరుపతికి పవన్ కళ్యాణ్

  • తిరుపతిలో జనసేన కీలక సమావేశం
  • భేటీ కానున్న జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ
  • పవన్ తో పాటు నాదెండ్ల మనోహర్ హాజరు
  • పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్న జనసేనాని
Pawan Kalyan will come to Tirupati

త్వరలో తిరుపతి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో జనసేన పార్టీ కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ నెల 21న తిరుపతిలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) భేటీ జరగనుంది. ఈ సమావేశానికి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హాజరవుతారు. సాయంత్రం 4 గంటలకు జరిగే సమావేశంలో పవన్ కల్యాణ్ తో పాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొంటారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన చేసింది.

More Telugu News