చరణ్ కి కథ చెప్పిన తమిళ దర్శకుడు!

Tamil director Lokesh narrated a story to Charan
  • 'ఆర్ఆర్ఆర్', 'ఆచార్య' సినిమాలలో చరణ్ 
  • 'జెర్సీ' దర్శకుడితో సినిమా అంటూ వార్తలు
  • చరణ్ కి కథ చెప్పానన్న లోకేశ్ కనగరాజ్
  • త్వరలో పూర్తి కథ చెబుతానని వెల్లడి    
మెగా హీరో రామ్ చరణ్ నటించే తదుపరి సినిమా ఏమిటన్నది ఇంతవరకు అధికారికంగా వెల్లడి కాలేదు. గత కొంతకాలంగా చరణ్ చేస్తున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రం త్వరలో పూర్తవుతుంది. ఆ వెంటనే 'ఆచార్య' సినిమా షూటింగులో చరణ్ జాయిన్ అవుతాడు. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే, ఆ తర్వాత చేయబోయే సినిమా ఏమిటన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.

లాక్ డౌన్ సమయం నుంచీ చరణ్ పలువురు దర్శకులు చెబుతున్న కథలు వింటున్నాడని వార్తలొచ్చాయి. 'జెర్సీ' చిత్రంతో సక్సెస్ కొట్టిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కూడా ఓ కథ చెప్పాడనీ, అది చరణ్ కి నచ్చిందని కూడా ప్రచారం జరిగింది. అయితే, దీనిపై మళ్లీ ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ క్రమంలో ప్రముఖ తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ పేరు కూడా వినిపిస్తోంది.

ఇటీవల చరణ్ ని కలసి ఆయన ఓ కథ చెప్పాడని వార్తలొచ్చాయి. దీనిని తాజాగా లోకేశ్ కూడా ధ్రువీకరించాడు. 'చరణ్ ని కలసి ఓ లైన్ చెప్పాను. త్వరలోనే పూర్తి కథ చెబుతాను' అంటూ లోకేశ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. దీనిని బట్టి ఈ దర్శకుడితో చరణ్ సినిమా సెట్ అవ్వచ్చని అంటున్నారు. తాజాగా విజయ్ తో లోకేశ్ చేసిన 'మాస్టర్' సినిమా సంక్రాంతికి విడుదలవుతోంది. మరోపక్క, ప్రస్తుతం కమలహాసన్ తో లోకేశ్ 'విక్రమ్' అనే సినిమా చేస్తున్నాడు.
Go Back to Shorts
Ramcharan
Lokesh Kaaaanagaraj
Goutham Tinnanuri
Chiranjeevi

More Telugu News