Andhra Pradesh: ఏపీలో మునుపెన్నడూ లేని స్థాయిలో తగ్గిన కరోనా కేసులు

  • గత 24 గంటల్లో కొత్తగా 214 కేసుల నమోదు
  • రాష్ట్ర వ్యాప్తంగా ఇద్దరి మృతి
  • రాష్ట్రంలోని యాక్టివ్ కేసుల సంఖ్య 3,992
Corona cases in AP decreased drastically

ఏపీలో కరోనా వైరస్ కొత్త కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 214 కేసులు మాత్రమే నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 46 కేసులు, విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 4 కేసులు నమోదయ్యాయి. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. ఇదే సమయంలో 422 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు అయ్యారు. తాజా గణాంకాలతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,78,937కి చేరుకున్నాయి. మొత్తం మరణాలు 7,078కి పెరిగాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 3,992 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 8,67,867 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

More Telugu News