హైదరాబాద్‌లో పైప్‌లైన్ పగిలి రహదారిపై ఎగిసిపడుతోన్న నీరు.. భారీగా ట్రాఫిక్ జామ్

pipeline bursts in hydearabad
  • మెహిదీపట్నం-అత్తాపూర్ రహదారిపై ట్రాఫిక్ జామ్
  • లంగర్‌హౌస్ రేతిబౌలిలో పగిలిన పైపులైన్
  • పీవీ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నంబరు 53 వద్ద ఘటన
హైదరాబాద్‌లోని మెహిదీపట్నం-అత్తాపూర్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. లంగర్‌హౌస్ రేతిబౌలిలో పైపులైన్ పగలడం వల్ల ఈ పరిస్థితి నెలకొంది. అక్కడి పీవీ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నంబరు 53 వద్ద నీటిపైపు లైన్ పగిలింది. దీంతో నీరు భారీగా బయటకు వస్తుండడంతో ఎవ్వరూ ఏమీ చేయలేకపోతున్నారు. ఆ పిల్లర్ వద్ద కింది నుంచి బ్రిడ్జి ఎత్తు మేర నీరు ఎగిసిపడుతోంది. ప్రధానంగా ఆ పిల్లర్ వద్ద ఒక్క వాహనం కూడా ముందుకు వెళ్లట్లేదు.
    
ఎగిసిపడుతున్న నీటి వల్ల మెహిదీపట్నం-అత్తాపూర్ రహదారిపై నీరు నిలిచిపోయింది. ఆ రహదారిపై పెద్ద ఎత్తున వెళ్లే వాహనాల రాకపోకలన్నీ నత్తనడకన నడుస్తుండడంతో ట్రాఫిక్ ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  పైపులైను పగలడంపై స్పందించిన అధికారులు నీటి ప్రవాహాన్ని ఆపడానికి ప్రయత్నాలు జరుపుతున్నారు.
Go Back to Shorts
Hyderabad
pipeline
traffc jam

More Telugu News