Perni Nani: చంద్రబాబుపై పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు

  • అమరావతి సభలో చంద్రబాబు వ్యాఖ్యలపై నాని ఫైర్  
  • ఏం పీకారని చంద్రబాబు అడుగుతున్నారు
  •  పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని నిర్ణయించాం
Perni Nani controversial comments on Chandrababu

అమరావతిలో నిన్న జరిగిన జనభేరి సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రులు విరుచుకుపడుతున్నారు. అధికారంలోకి వచ్చిన 19 నెలల కాలంలో ఏం పీకారంటూ చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ చంద్రబాబుపై మండిపడ్డారు.

ఏం పీకారని చంద్రబాబు అడుగుతున్నారని, ...కించుకునే ధైర్యం ఉంటే కోర్టుకెళ్లి స్టేలు ఎందుకు తెచ్చుకున్నారని ప్రశ్నించారు. పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు వారికి ప్రోత్సాహకాలను ఇవ్వాలని కేబినెట్ లో నిర్ణయించామని పేర్ని నాని చెప్పారు. రూ. 400 కోట్ల పెట్టుబడులు పెడితే దాన్ని మెగా టూరిజం ప్రాజెక్టుగా పరిగణిస్తామని తెలిపారు. లీజు గడువును కూడా 33 ఏళ్ల నుంచి 99 ఏళ్లకు పొడిగించాలని నిర్ణయించామని చెప్పారు.

More Telugu News