COVID19: ఏపీ కరోనా అప్ డేట్: 500 కొత్త కేసులు, 5 మరణాలు

  • గడచిన 24 గంటల్లో 61,452 మందికి కరోనా టెస్టులు
  • అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 88 కేసులు
  • అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 9 మందికి పాజిటివ్
  • తాజాగా కోలుకున్న వారు 563 మంది
  • ఇంకా 4,660 మందికి చికిత్స
covid spreading details of Andhra Pradesh

ఏపీలో కరోనా వ్యాప్తికి సంబంధించిన తాజా బులెటిన్ ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో 61,452 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, వారిలో 500 మందికి పాజిటివ్ అని తేలింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 88 కేసులు రాగా, కృష్ణా జిల్లాలో 77, పశ్చిమ గోదావరి జిల్లాలో 63, గుంటూరు జిల్లాలో 55 కేసులు గుర్తించారు. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 9 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.

అదే సమయంలో 563 మంది కరోనా నుంచి కోలుకోగా, ఐదుగురు మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,76,336కి పెరిగింది. మరణాల సంఖ్య 7,064కి చేరింది. ఇప్పటివరకు 8,64,612 మంది వైరస్ ప్రభావం నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,660 మందికి చికిత్స కొనసాగుతోంది.

More Telugu News