పాక్ ఆయుధ బంకర్లను తుత్తునియలు చేసిన భారత సైన్యం... వీడియోలు ఇవిగో!
- సరిహద్దుల్లో కాల్పులు జరిపిన పాక్
- దీటుగా తిప్పికొడుతున్న భారత్
- పాక్ బంకర్లు, చమురు నిల్వల గిడ్డంగులపై మిసైల్ దాడులు
దవార్, నౌగామ్, యూరి, కేరన్ సెక్టార్లలో భారత బలగాలకు, పాక్ రేంజర్లకు మధ్య భారీగా కాల్పులు జరిగాయి. ఈ నేపథ్యంలోనే భారత్ స్వల్ప దూరం ప్రయోగించే వీలున్న క్షిపణులతో పాక్ బంకర్ల పనిబట్టింది. కాగా, ఎల్ఓసీ వెంబడి పలు ప్రాంతాల్లో ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్టు భారత సైనికాధికారులు తెలిపారు.