Gujarat: అహ్మదాబాద్‌లోని రసాయన గోదాములో అగ్నిప్రమాదం.. 12 మంది మృతి

  • మంటల ధాటికి పేలుడు.. కూలిన పైకప్పు
  • మృతుల్లో ఐదుగురు మహిళలు
  • 9 గంటలపాటు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్
12 Dead As Explosion Rips Through Chemical Godown In Ahmedabad

గుజరాత్‌, అహ్మదాబాద్‌లోని ఓ రసాయనాల గోదాములో జరిగిన అగ్నిప్రమాదంలో 12 మంది మృతి చెందారు. వీరిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. మరో 9 మంది గాయపడ్డారు. పారిశ్రామికవాడ పిరానా-పిప్లాజ్‌ రోడ్డులోని గోదాములో ఈ ఘటన జరిగింది. గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పేలుళ్లు కూడా సంభవించాయి. దీంతో పైకప్పు కుప్పకూలింది.

 సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 26 అగ్నిమాపక యంత్రాలతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. 9 గంటలపాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. శిథిలాల కింద చిక్కుకున్న 14 మందిని రక్షించి అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని ఎల్‌జీ ఆసుపత్రికి తరలించారు.

More Telugu News