Raghunandna Rao: హైదరాబాదు పోలీసుల అదుపులో దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ బావమరిది!

  • నవంబరు 3న దుబ్బాకలో ఉప ఎన్నికల పోలింగ్
  • నేటితో ముగియనున్న ప్రచారపర్వం
  • హైదరాబాదులో రూ.1 కోటి స్వాధీనం చేసుకున్న పోలీసులు
Raghunandan Rao brother in law in police custody

దుబ్బాక అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఎల్లుండి పోలింగ్ జరగనున్న నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాదులోని బేగంపేటలో రూ.1 కోటి స్వాధీనం చేసుకోగా, ఈ డబ్బును తీసుకెళుతున్న సురభి శ్రీనివాసరావు, డ్రైవర్ రవికుమార్ లను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆ డబ్బును తాము దుబ్బాక తీసుకెళుతున్నట్టు సురభి శ్రీనివాసరావు వెల్లడించినట్టు సీపీ అంజనీకుమార్ వెల్లడించారు.

సురభి శ్రీనివాసరావు దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు స్వయానా బావమరిది అని తెలిపారు. బేగంపేటలోని విశాఖ ఇండస్ట్రీస్ సంస్థ మేనేజర్ నుంచి ఆ డబ్బును తీసుకుని దుబ్బాక వెళుతున్నట్టు వెల్లడైందని, విశాఖ ఇండస్ట్రీస్ సంస్థ పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ కు చెందినదని అంజనీ కుమార్ వివరించారు. ఓటర్లకు పంచేందుకు ఈ డబ్బు తరలిస్తున్నట్టు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. ఇటీవలే సిద్ధిపేటలో రఘునందన్ మామ, ఇతర బంధువుల నివాసాల్లోనూ పోలీసులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

More Telugu News