6 లక్షల క్యూసెక్కులు దాటిన కృష్ణమ్మ వరద... విజయవాడలో రెండో ప్రమాద హెచ్చరిక!

Heavy Flood in Krishna River
  • గంటల వ్యవధిలో పెరిగిన వరద
  • 6.65 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి
  • కృష్ణలంక లోతట్టు ప్రాంతాలలోని ఇళ్లలోకి వరద నీరు
నిన్న మొన్నటి వరకూ 3 లక్షల క్యూసెక్కుల వరకూ ఉన్న కృష్ణానది వరద, ఒక్కసారిగా 6 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. దీంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను అమలు చేస్తున్నామని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు వెల్లడించారు. ఈ ఉదయం ప్రకాశం బ్యారేజ్ నుంచి 6,65,925 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ పరిధిలోని కృష్ణలంకలోని లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. నది వెంబడి ఉన్న గ్రామాలు, లంకల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
Go Back to Shorts
Prakasam Barrage
Vijayawada
Krishna River
Flood

More Telugu News