Jagan: 100 శాతం అక్షరాస్యత దిశగా అడుగులు వేస్తున్నాం: జగన్

  • జీవితాలను మార్చగల శక్తి విద్యకు ఉంది
  • పేదరికంపై పోరాటానికి విద్య ఒక ఆయుధం
  • విద్యా వ్యవస్థ రూపురేఖలను మారుస్తున్నాం
We are paving the way for 100 percent lieracy tweets Jagan

దేశంలో అతి తక్కువ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల జీవితాలను మార్చగల శక్తి విద్యకు మాత్రమే ఉందని అన్నారు. పేదరికం, అసమానత్వాలపై పోరాటానికి విద్య ఒక ఆయుధమని చెప్పారు. అమ్మఒడి, నాడు-నేడు, విద్యాదీవెన పథకాల ద్వారా రాష్ట్రంలో విద్యావ్యవస్థ రూపురేఖలను మారుస్తున్నామని తెలిపారు. ఈ పథకాల ద్వారా 100 శాతం అక్షరాస్యతను సాధించేందుకు ఒక మార్గాన్ని తయారుచేసుకున్నామని చెప్పారు.

More Telugu News