తెలంగాణ నుంచి మంచి నీళ్ల ట్యాంకర్ నిండా మద్యం సరఫరా
- గుంటూరు జిల్లా మునుగోడు మండలంలో పట్టివేత
- ఎనిమిది మంది అరెస్టు
- 10వేల మద్యం సీసాలు స్వాధీనం
ఆ మద్యాన్ని తెలంగాణ నుంచి నీళ్ల ట్యాంకర్లో తరలించి తీసుకొచ్చిన సత్తెనపల్లి మండలం అబ్బూరుకు చెందిన ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. తెలంగాణ నుంచి మద్యం వస్తోందన్న ముందస్తు సమాచారంతో పోలీసులు నిఘా పెట్టి ఆ ఎనిమిది మంది నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి దాదాపు 10వేల మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.