ఏపీలో పత్రికలకు ప్రభుత్వ ప్రకటనలపై హైకోర్టులో విచారణ
- అధికార పక్షానికి చెందిన పత్రికకు అధిక ప్రకటనలంటూ పిటిషన్
- సర్క్యులేషన్ ను పట్టించుకోవడంలేదని ఆరోపణ
- టీడీపీ వాళ్లు పిటిషన్ వేయించారన్న ప్రభుత్వ న్యాయవాది
ఇక, పిటిషనర్ తరఫున న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. సర్క్యులేషన్ ప్రకారం ప్రకటనలు ఇవ్వడంలేదని కోర్టుకు తెలిపారు. పైగా, పార్టీ రంగులతో ప్రకటనలు ఇవ్వడం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని పేర్కొన్నారు. పత్రికలకు ప్రభుత్వం ప్రకటనలు ఇస్తున్న తీరు నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఆరోపించారు. వాదనలు విన్న హైకోర్టు... కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.