Andhra Pradesh: ఏపీలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. 24 గంటల్లో 86 మంది మృతి.. తాజా అప్ డేట్స్!

  • 24 గంటల్లో కొత్తగా 9,742 కేసులు
  • 3,16,003కి చేరిన మొత్తం కేసుల సంఖ్య
  • 2,906కి చేరిన మరణాల సంఖ్య
Andhara Pradesh witnesses 9742 new Corona cases in last 24 hours

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 9,742 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1,399 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 86 మంది కరోనా కారణంగా మృతి చెందారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో అత్యధికంగా 15 మంది చొప్పున ప్రాణాలు విడిచారు. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 57,685 మందికి టెస్టులు నిర్వహించారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,16,003కి చేరుకుంది. 2,906 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 86,725 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

More Telugu News