Liquor: అక్రమ మద్యం తరలిస్తూ పట్టుబడిన బీజేపీ నేత

  • గతంలో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీచేసిన రామాంజనేయులు
  • మద్యం తరలిస్తుండగా అరెస్ట్ చేసిన పోలీసులు
  • రూ.6 లక్షల విలువైన మద్యం స్వాధీనం
BJP leader caught with illegal liquor transportation

అక్రమ మద్యం తరలిస్తూ ఓ బీజేపీ నేత పట్టుబడడం ఆసక్తికరంగా మారింది. చిట్యాల నుంచి గుంటూరుకు మద్యం తరలిస్తున్న గుడివాక రామాంజనేయులు అనే బీజేపీ నేతను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు ఏఈఎస్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో రూ.6 లక్షల విలువైన 1,920 మద్యం సీసాలు, 3 కార్లు స్వాధీనం చేసుకున్నారు.

గుడివాక రామాంజనేయులుతో పాటు మచ్చా సురేశ్, కె.నరేశ్ అనే వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో గుడివాక రామాంజనేయులును ఏ-1గా పేర్కొన్నారు. రామాంజనేయులు 2019లో మచిలీపట్నం ఎంపీ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు.

More Telugu News