Crime News: బాలికను లాక్కెళ్లి నాలుకను క‌త్తిరించి, అత్యాచారం చేసి చంపిన వైనం

  • ఉత్త‌రప్ర‌దేశ్ ల‌ఖీంపూర్ ఖేరీ జిల్లాలో ఘటన
  • చెరుకు తోటలోకి లాక్కెళ్లి దారుణం
  • కళ్లను కూడా పీకేశారన్న తండ్రి
  • ఇద్దరి అరెస్టు
youth killed girl in up

ఉత్త‌రప్ర‌దేశ్ ల‌ఖీంపూర్ ఖేరీ జిల్లాలోని ఓ గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 13 ఏళ్ల బాలికను బ‌ల‌వంతంగా చెరుకు తోటలోకి లాక్కెళ్లిన కొందరు యువకులు ఆమె నాలుక క‌త్తిరించి సామూహిక అత్యాచారానికి పాల్ప‌డి, ఆ తర్వాత గొంతు కోసి చంపేశారు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని అక్కడే వదిలేసి పారిపోయారు. త‌మ కూతురు ఇంటి వద్ద క‌న‌బ‌డ‌క‌పోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆమె ఆచూకీ కోసం వెతికారు.  చెరుకు తోటల్లో ఆమె మృతదేహం ఉందని తెలుసుకుని అక్కడకు చేరుకున్నారు.

దుండగులు ఆమె క‌ళ్ల‌ను పీకేసినట్లు ఆ బాలిక తండ్రి అంటున్నాడు. అయితే, ఆ బాలిక క‌ళ్ల‌ను పొడిచినట్లు పోస్టుమార్టం నివేదిక‌లో వెల్ల‌డి కాలేద‌ని పోలీసులు చెప్పారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు ఇద్దరు నిందితులని  అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై బీఎస్పీ అధినేత్రి మాయావ‌తితో పాటు పలువురు ప్రముఖులు స్పందిస్తూ నిందితులకు కఠిన శిక్ష వేయాలని డిమాండ్ చేశారు.

More Telugu News