బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా నవ్వులు పూయించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
- 1994లో బీజేపీ నేత హత్య
- ధరేంద్ర వాల్వీ అనే కాంగ్రెస్ నేతకు జీవితఖైదు
- సుప్రీంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన వాల్వీ
"నేడు శ్రీకృష్ణ జన్మాష్టమి. కృష్ణ భగవానుడు పుట్టింది జైల్లోనే. ఆయన పుట్టినరోజున బెయిల్ పిటిషన్ విచారిస్తున్నాం కాబట్టి జైలు కావాలా, లేక బెయిలు కావాలా?" అంటూ చమత్కరించారు. దాంతో ధర్మేంద్ర వాల్వీ తరఫు న్యాయవాది బెయిలే కావాలని అన్నారు. బెయిల్ మంజూరు చేస్తూ కూడా ఎస్ఏ బోబ్డే సరదాగా స్పందించారు. "మంచిది... మీకు పెద్దగా మతం పట్టింపులేవీ లేవనుకుంటా" అంటూ బెయిల్ ఇస్తున్నట్టు తీర్పు ఇచ్చారు.