రాజధానిపై హైకోర్టు స్పందన హర్షణీయం: సీపీఐ, సీపీఎం
- సొంత రాజకీయాల కోసమే జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన
- జగన్ మొండిగా వ్యవహరిస్తున్నారు
- సీఎం మారినప్పుడల్లా రాజధానిని మారుస్తారా?
ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రాజధానిని మారుస్తారా? అని ప్రశ్నించారు. అమరావతి రైతులకు వామపక్షాల మద్దతు ఉంటుందని చెప్పారు. శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న రైతులను పోలీసులతో ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. అమరావతిని రక్షించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పారు. రాష్ట్ర ప్రజలంతా కరోనాతో ఇబ్బంది పడుతుంటే... ముఖ్యమంత్రి ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.