Corona Virus: ఏపీ కరోనా అప్ డేట్స్: గుంటూరు జిల్లాలో 12 మంది మృత్యువాత

  • ఒక్కరోజులో 67 మంది కన్నుమూత
  • కొత్తగా 9,747 మందికి కరోనా పాజిటివ్
  • 6,953 మంది డిశ్చార్జి
Twelve people died in Guntur district due to corona virus

ఏపీలో కరోనా మరణాల ఉద్ధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 67 మంది మృతి చెందారు. ఒక్క గుంటూరు జిల్లాలోనే 12 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు. మొత్తం మరణాల సంఖ్య 1,604కి పెరిగింది. కొత్తగా 9,747 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. దాంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,76,333కి చేరింది. తాజాగా 6,953 మందిని డిశ్చార్జి చేశారు. ఇంకా 79,104 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 95,625 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

More Telugu News