ఏపీలో కరోనా మరణమృదంగం... ఒక్కరోజులో 19 మంది మృత్యువాత
- రాష్ట్రంలో 328కి పెరిగిన కరోనా మరణాలు
- 24 గంటల వ్యవధిలో 1,933 మందికి పాజిటివ్
- తాజాగా 846 మంది డిశ్చార్జి
ఇక, కొత్తగా 1,933 మందికి కరోనా కేసులు గుర్తించారు. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 268, కర్నూలు జిల్లాలో 237, కృష్ణా జిల్లాలో 206 మందికి కరోనా సోకినట్టు తేలింది. నేటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 29,168కి చేరింది. తాజాగా 846 మంది డిశ్చార్జి కాగా, ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 15,412కి చేరింది. ఇంకా 13,428 మంది చికిత్స పొందుతున్నారు.