Bandla Ganesh: చిరంజీవి ఫోన్ చేసి పది నిమిషాలు మాట్లాడారు... నాకు కరోనా సోకిన విషయం పవన్ కు తెలిసుండకపోవచ్చు: బండ్ల గణేశ్

  • కరోనా నుంచి కోలుకున్న బండ్ల గణేశ్
  • ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ
  • మారుతి ఫోన్ కాల్ సంతోషం కలిగించిందని వెల్లడి
Bandla Ganesh tells more phone calls that he received after getting well from corona

ఇటీవలే కరోనా పాజిటివ్ రావడంతో టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ ఆసుపత్రిపాలైన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఓ మీడియా సంస్థకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. తాను ఇతర వ్యాపార పనుల నిమిత్తం ఎక్కువగా షాద్ నగర్ వెళుతుంటానని, అక్కడేమైనా కరోనా సోకి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఓ ఫ్రెండ్ కుమారుడికి యాక్సిడెంట్ అయితే ఆసుపత్రికి వెళ్లానని, అక్కడున్నప్పుడే ఫోన్ కు కరోనా రిపోర్టు సందేశం రూపంలో వచ్చిందని తెలిపారు. దాంట్లో పాజిటివ్ అని ఉండడంతో మొదటిసారి భయం అంటే ఏంటో తెలిసొచ్చిందని, టెన్షన్ కు గురయ్యానని తెలిపారు.

అయితే ఆసుపత్రిలో చికిత్స పొంది త్వరగానే కోలుకున్నానని, తనకు మోహన్ బాబు, దర్శకుడు మారుతి, హీరో శ్రీకాంత్, రాజా రవీంద్ర, వీవీ వినాయక్, శ్రీను వైట్ల ఫోన్ చేసి పరామర్శించారని వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి గారు ఫోన్ చేసి పది నిమిషాలు మాట్లాడారని, ఎన్నో జాగ్రత్తలు చెప్పారని తెలిపారు. ఈ సందర్భంగా యాంకర్ మాట్లాడుతూ, మీ దేవుడు పవన్ కల్యాణ్ ఫోన్ చేయలేదా? అని ప్రశ్నించింది.

అందుకు బండ్ల గణేశ్ బదులిస్తూ, పవన్ ఫోన్ చేయలేదని తెలిపారు. బహుశా, తనకు కరోనా సోకిన విషయం ఆయనకు తెలిసుండకపోవచ్చని అన్నారు. నాకు కరోనా సోకిన విషయం ఆయనకు తెలియదేమోలే అని సరిపెట్టుకోవడమే మంచిదని అన్నారు. అయితే ఎంతోమంది ఫోన్ చేసినా దర్శకుడు మారుతి ఫోన్ చేసినప్పుడు ఎంతో సంతోషానికి గురయ్యానని, ఆయనతో తాను ఎలాంటి చిత్రం చేయకపోయినా ఫోన్ చేసి పరామర్శించడం మనసును హత్తుకుందని వెల్లడించారు.

More Telugu News