Andhra Pradesh: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. సిలబస్ 30 శాతం కుదింపు!

  • కరోనా కారణంగా ఇంకా ప్రారంభం కాని క్లాసులు
  • ఆన్ లైన్ క్లాసులకు సన్నద్ధమవుతున్న విద్యాశాఖ
  • క్లాసులు జరిగే రోజులు తగ్గనున్న వైనం
AP govt to reduce 30 percent syllabus for students

కరోనా వైరస్ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే అన్ని పరీక్షలు రద్దైపోయాయి. అంతా సవ్యంగా ఉంటే ఇప్పటికే ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై ఉండేది. కరోనా కారణంగా పాఠశాలలు, కాలేజీలు ప్రారంభం కాలేదు. దీంతో, ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలనే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది.

ఈ నేపథ్యంలో, ఏపీ పాఠశాల విద్యాశాఖ ఆగస్ట్ 3 నుంచి వచ్చే ఏడాది మే రెండో వారం వరకు క్లాసులను నిర్వహించాలని సమాలోచనలు చేస్తోంది. క్లాసులు జరిగే రోజులు తగ్గుతుండటంతో... సిలబస్ ను 30 శాతం తగ్గించాలని నిర్ణయించారు. 2021 మే తొలి వారంలో 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేలా కేలండర్ సిద్ధం చేస్తున్నారు. మే రెండో వారం నుంచి జూన్ 12 వరకు వేసవి సెలవులు ఇవ్వాలని భావిస్తున్నారు.

More Telugu News